అనంత్ నాగ జిల్లలో నాఘ్బాల్ హిందువుల ప్రసిద్ధ యాత్రా స్థలం. ఈ ప్రదేశానికి వచ్చిన టూరిస్టులు ఇక్కడ ఒక పవిత్ర నీటి బుగ్గను ఒక కొండ నుండి ఊరటాన్ని చూస్తారు. ఈ నీటి బుగ్గ విష్ణు మూర్తి గా భావించి పూజిస్తారు దీనిని అనంత అంటారు. చక్కని నీడను ఇచ్చే చినార్ వృక్షాల వద్ద ఒక పెద్ద సరస్సు కూడా నాగ బాల కాంప్లెక్స్ వద్ద చూడవచ్చు. ఈ సరస్సు లోని చేపలు పవిత్రమైనవని యాత్రికులు భావిస్తారు.
ఈ పవిత్ర నీటి బుగ్గ కు ఎడమ వైపుగా శిధిలమైన ఒక చిన్న దేవాలయం వుంటుంది. దీనిని కాశ్మీర్ పాలకుడు రెండవ డోగ్రా మహారాజ రానా బీర్ సింగ్ నిర్మించాడు. ఈ టెంపుల్ శిదిలావస్థ లో ఉన్నపటికీ యాత్రికులు ఇక్కడ అనంత భగవాన్ విగ్రహాన్ని చూడవచ్చు.
నాగ బాల కాంప్లెక్స్ లోనే కల శివుడి గుడి మరొక ప్రధాన ఆకర్షణ. ఈ గుడి చాలా పురాతనమైనది. సుమారు 1885 నుండి 1925 ల మధ్య అప్పటి రాజు మహారాజ ప్రతాప్ సింగ్ దీనిని నిర్మించాడు. ఈ కాంప్లెక్స్ లో హిందువుల గుడు లే కాక ఒక గురుద్వారా కూడా కలదు. ఇది సిఖ్ మతానికి చెందినది. పర్యాటకులు ఈ ప్రదేశంలో అన్ని చర్మ వ్యాధులను పోగొట్టే ఔషధ గుణాలు కల నీరు కల ఒక పవిత్ర సల్ఫర్ నీటి బుగ్గ ను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications