నాగనాధ్ జ్యోతిర్లింగ మత ప్రధానమైంది. ప్రత్యేకించి హిందువులకు పవిత్రమైనది. ఈ పుణ్య క్షేత్రం దేశంలోని ఇతర భాగాలలో కల హిందువుల పవిత్ర పన్నెండు జ్యోతిర్లింగాలలోను మొదటిదిగా చెపుతారు. నాగనాధ్ దేవాలయం చెక్కడాలు ప్రదేశానికి ఎంతో అందం తెచ్చి పెట్టాయి. దేవాలయం రాతి నిర్మాణం. గోడలే స్తంభాలుగా ఆధారాన్నిస్తాయి. దేవాలయం చుట్టు పక్కల చాలా పటిష్టమైన నిర్మాణం కలదు. ఈ దేవాలయ విశిష్టత ఏమంటే, శివుడి వాహనం నంది దేవాలయ వెనుక భాగంలో పూర్తిగా ఒక వేరు నిర్మాణంగా ఉంటుంది. ఔంధా కు సుమారు 65 కి.మీ.ల దూరంలో నాందేడ్ కలదు. దీనిలో సచ్ ఖండ్ హుజూర్ సాహిబ్ గురుద్వారా కలదు. ఇది ఈ పవిత్ర ప్రదేశంలో సిక్కుల గురువైన గురు గోవింద్ సింగ్ అస్ధికలు సమాధి చేయబడ్డాయి. మీరు ఔంధ్ చేరితే ఈ ప్రదేశాన్ని తప్పక దర్శించండి.