ఔంధా నాగనాధ్ హింగోలి జిల్లాలో ఒక చిన్న పట్టణం. మహారాష్ట్రలోని మరాఠ్ వాడా క్రిందకు వస్తుంది.
ఔంధా నాగనాధ్ - మొదటి జ్యోతిర్లింగంఔంధా నాగనాధ్ భారత దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు. మొదటి జ్యోతిర్లింగం కూడాను. మహారాష్ట్రలోనే కల 5 జ్యోతిర్లింగాలలోను ఇది ఒకటి. పాండవ సోదరులలో అగ్రజుడైన యుధిష్టురుడు శివభగవానుడి రూపంగా ఒక జ్యోతిర్లింగాన్ని వారు 14 సంవత్సరాల అరణ్య వాసంలో ఉన్నపుడు ప్రతిష్టించారని నమ్ముతారు. ఔంధా నాగనాధ్ దేవాలయం పూర్తిగా హేమద్ పంతి శిల్ప శైలిలో ఉండి శివభగవానుడి లింగం కలిగి ఉంటుంది. ఈ దేవాలయం షుమారుగా 6,000 చ. అడుగులు వ్యాపించింది. ఈ దేవాలయంలో నంది విగ్రహం అన్ని దేవాలయాలలో వలే ముందు వైపు కాక, దేవాలయానికి వెనుక భాగంలో ఉంటుంది. దేవాలయ చుట్టుపట్ల, అనేక ఇతర చిన్న దేవాలయాలు కూడా కలవు. అవి ఇతర జ్యోతిర్లింగాలను చూపిస్తాయి. దత్తాత్రేయ, నీలకంఠేశ్వర, దశావతార, వేదవ్యాస లింగ, మరియు గణపతి వంటి దేవుళ్ళ విగ్రహాలను కూడా చూడవచ్చు. ఒక మతపర ప్రదేశం ఔంధా ప్రదేశాన్ని సంవత్సరంలో ఒక్క వేసవి తప్ప ఎపుడైనా చూడవచ్చు. హింగోలికి సమీపంలో కల ఈ పవిత్ర ప్రదేశం రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలనుండి తేలికగా చేరేదిలా ఉంటుంది.
మీరు కనుక హింగోలి వెళ్ళే వారైతే, ఔంధా నాగనాధ్ దేవాలయాన్ని తప్పక చూడాలి. మీ పర్యటన జాబితాలో దీనిని మొదటిదిగా పెట్టుకోండి. ఈ పవిత్ర క్షేత్రం ప్రతి ఒక్కరికి వారిలోని ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.
ఇతర ఆకర్షణలు
త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వరం మహారాష్ట్రలోనే కాక దేశం లోని అందరికి పవిత్రప్రదేశం. నాసిక్ సమీపంలో కలదు. త్రయింబకేశ్వరం ఔంధా నాగనాధ్ లో వలనే దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే మార్గంలో ఉన్నవి కనుక ఒకే రోజులో దర్శించవచ్చు. ఈ త్రయంబకేశ్వరుడిని దర్శించుకొన్నవారికి మోక్షం కలుగుతుందని విశ్వసిస్తారు.
యాత్రికులు ఈ ప్రదేశంలో గల హోటళ్ళు, లాడ్జీలు వంటి వాటిలో వసతి పొందవచ్చు. దేవాలయ ట్రస్టీలు కూడా వసతి ఏర్పాట్లు చేశారు.
గ్రిష్నేశ్వర దేవాలయం (తప్పక చూడాలి)గ్రిష్నేశ్వర లో కూడా శివుడి జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం కలదు. గ్రిష్నేశ్వర ఔరంగాబాద్ సమీపంలోని ప్రసిద్ధి గాంచిన ఎల్లోరా గుహల వద్ద కలదు.
అహల్యాబాయ్ చే నిర్మించబడిన ఈ పురాతన క్షేత్రం ఎంతోమంది భక్తులను ఏటా ఆకర్షిస్తుంది. దీనిని ఛత్రపతి శివాజి మహారాజ్ పితామహుడు 400 సంవత్సరాల క్రిందట సుమారు 16 వ శతాబ్దంలో పునరుద్ధరించారు.
ఔంధా నాగనాధ్ నుండి ఈ జ్యోతిర్లింగాన్ని తేలికగా చేరి దర్శించుకోవచ్చు. రోడ్డు ప్రయాణం సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది.