హరిశంకర్, గంధమర్దన కొండల వాలులలో ఉంది. ఇది ఒక అద్భుతమైన సహజ సౌందర్యాలతో బాటుగా ఒక హిందూ తీర్థయాత్ర ప్రాంతం కూడా. ఈ ప్రాంతం నుండి ఒక శాశ్వత కాలువ పారుతుంది. విష్ణు భగవానునికి, కృష్ణ భగవానునికి కూడా చెందిన హరిశంకర ఆలయానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమాన్, జగన్నాథుడు, రామునికి చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఆలయం ప్రాంగణంలో భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఒక ధర్మశాల ఉంది.
చౌహాన్ వంశానికి చెందిన ఒక రాజు క్రీ.శ.14 వ శతాబ్దంలో హరిశంకర విగ్రహాన్ని కొనుగొన్నాడు. ఈ విగ్రహంతో బాటుగా క్రీ.శ 12 వ శతాబ్దానికి చెందిన నాట్యం చేసే గణేషుని విగ్రహం కూడా దొరికింది. గంధమర్దన కొండలకు ఎదురుగా నర్సింగనాథ్ ఆలయం ఉంది. హరిశంకర ఆలయానికి, నర్సింగనాథ్ ఆలయానికి మధ్య గల పీఠభూమిలో పరిమళగిరి విశ్వవిద్యాలయానికి చెందినవిగా విశ్వసించే గత కాలానికి చెందిన బౌద్ధ అవశేషాలు ఉన్నాయి.
హరిశంకర ప్రాంతాన్ని ఏడాది పొడవునా సందర్శించవచ్చు. ఇక్కడ ఉన్న ఒక వనమూలికా తోటలో మీరు 1000 కు పైగా వనమూలికా మొక్కలను చూడవచ్చు. ఈ ప్రాంతానికి చక్కటి నిర్వహణ ఉన్న మంచి రోడ్లతో అనుసంధానం ఉంది. హరిశంకర్ నుండి బలంగీర్ కు బస్సులు తరచుగా ఉంటాయి. ఇది బలంగీర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications