శాహాబాద్ కోట అటవీ ప్రాంత౦ మధ్యలోని కొండమీద ఉన్న ఒక పురాతన కోట. దీనిని 1521లో చౌహాన్ వంశీయులైన ధన్దేల్ రాజ్పుత్ ముకుత్మని దేవ్ నిర్మించారు. ఇది హదోటి ప్రాంతం మొత్తంలో బలమైన, ఉత్తమ కోటగా భావించబడుతుంది. ఈ కోట కుండకొహ్ లోయ సరిహద్దుగా, 18 ఫిరంగులను కలిగిఉంది. ఈ కోట ప్రాంగణంలో తోప్ ఖానా అంటే ఫిరంగులు, బారూద్ ఖానా, కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి.