దుమ్ముగూడెం గ్రామం భద్రాచలానికి సుమారు 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశం కాకర కాయ ఆకారం లో ఒక చిన్న ద్వీపం గా వుంటుంది. ఈ ప్రదేశం లో రాముడు ఖర , దూషణ అనబడే రాక్షసుల నేతృత్వం లో వచ్చిన సుమారు 14000 మందిరాక్ష సులను వధించాడని చెపుతారు.
ఈ గ్రామం వధించ బడిన రాక్షసుల బూడిద పై నిర్మించారని చెపుతారు. ఆ బూడిదనే తెలుగు లో దుమ్ము అని అంటారు. ఈ ప్రదేశ ప్రజలు రాముడి అవతారమైన ఆత్మా రాముడిని పూజిస్తారు. ఈ ద్వీపం ఒక బలమైన బ్రిడ్జి తో ప్రధాన భూభాగానికి కలుపబడింది. ఈ బ్రిడ్జి సుమారు 100 సంవత్సరాల నాటిది గా చెపుతారు. దీనిని బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారు. బ్రిటిష్ వారు ఈ బ్రిడ్జి ని తమ రవాణా సదుపాయాలకు వినియోగించేవారు.