చంబ లో గబ్బర్ సింగ్ నేగి మెమోరియల్ ప్రసిద్ధి. ఈ మెమోరియల్ ను ఠాకూర్ గబ్బర్ సింగ్ గౌరవార్ధం 1925 లో నిర్మించారు. ఈయన గర్హ్వాల్ రైఫిల్స్ దళం లో 1913 లో పని చేసారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తన బెటాలియన్ తో కలసి జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. ఆయన మరణం తర్వాత ప్రభుత్వం ఆయనకు విక్టరీ క్రాస్ సాహస అవార్డు ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 వ తేదీ ఈ సాహస యోధుడి కి నివాళులు అర్పిస్తారు.