నవగ్రహ ఆలయాలు తొమ్మిది, ఇవి చెన్నై శివార్లలో ఉన్నాయి. ఈ తొమ్మిది ఆలయాలు నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలకు చెందినవి. ఈ ఆలయాలు చెన్నై నుండి కుంబకోణం ప్రయాణించే ప్రజలని రక్షించడానికి నిర్మించారు. పురాతన కాలంలో దారులు గుర్తించడానికి కష్టంగా ఉండేవి, ప్రయాణీకులు, ప్రమాదం నుండి బైట పడడానికి, ప్రయాణ సమయంలో దురద్రుష్టం కలుగకుండా ఆలయంలో ప్రార్ధనలు చేసేవారు.
మొత్తం తొమ్మిది ఆలయాలూ చోళుల కాలంలో నిర్మించబడ్డాయి, వారి శైలి, నిర్మాణకళ నిజంగా ప్రేరణ కలిగిస్తాయి. అయినప్పటికీ అన్ని ఆలయాలకు సమాన ప్రాధాన్యత ఉంది, కానీ కొన్నిటిని కొన్ని సంవత్సరాల నుండి నిర్లక్ష్యం చేయడంవల్ల అవి ఈ రోజు చెడు రూపంలో ఉన్నాయి. ఇక్కడ బాగా సంరక్షించబడుతున్న కొన్ని ఆలయాలు, ఇప్పటికీ సమయం గడుస్తున్నా కొత్తగా కనిపించే కొన్ని ఆలయాలూ ఉన్నాయి.
ఈ ఆలయాల ప్రధాన దేవత శివుడి, అయితే ఈ ఆలయాల వద్ద ఈయన వివిధ రూపాలలో పూజించబడతాడు. కొన్ని ఆలయాలలో శివుడు ప్రత్యెక గ్రహాలను సూచిస్తాడు, ఈ గ్రహాలు తమకుతాము పూజల౦దుకోలేవు.