రాసలీల అనేది శ్రీకృష్ణుడు రాధ, ఆయన సఖులు (స్నేహితురాళ్ళు) తో చేసే ప్రసిద్ధ నృత్యం. కృష్ణుడి అనుచరులైన మనిపురిలు దేవుడు, నృత్య గౌరవార్ధం ప్రతి ఏటా రాస మేళాని నిర్వహిస్తారు. ధలై జిల్లలో, మణిపురి కమ్యూనిటీ ఈ రాస్ ఫెయిర్ ని గణనీయంగా నిర్వహిస్తుంది.
సలెమ లో అతిపెద్ద వేడుక జరుగుతుంది, కానీ ఈకాలంలో రాస వేడుక దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ నెలలో జరుపుకునే అతిపెద్ద ఆకర్షణ రాస వేడుకలో రాసయత్ర లేదా కృష్ణుడి ఊరేగింపు ఉంటుంది. కృష్ణుడి వివిధ చేష్టలు, జీవన దశల మట్టి నమూనాలు ఈ ఊరేగింపులో ప్రదర్శించ బడతాయి.
కృష్ణుడి అనేకమంది అనుచరులు ధలై జిల్లలో నిర్వహించే రాస వేడుకలో తీవ్రంగా పాల్గొంటారు. నిజానికి, ఇది ఈ జిల్లాలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి కూడా. జిల్లా ప్రధాన కార్యాలయం అమ్బస్సా అగర్తలా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.