మహారాణి టెంపుల్ నే రాణి టెంపుల్ అని కూడా అంటారు. ఇది గుల్మార్గ్ హిల్ స్టేషన్ మధ్యలో కలదు. ఈ టెంపుల్ ను 1915 లో కాశ్మీర్ లో రాజ పాలన చివరి లోని మహారాజ హరి సింగ్ భార్య మోహిని బై సిసోదియా నిర్మించారు. పురాతన కాలం లో ఈ టెంపుల్ ను డోగ్రా రాజుల రాజ టెంపుల్ గా పరిగణించేవారు. ఈ టెంపుల్ ను మొహినేశ్వర్ శివాలయం గా పునరుద్ధరించి గుల్మార్గ్ లోని అన్ని మూలల నుండి కనపడేలా చేసారు.
ఈ టెంపుల్ లో శివ , మాత పార్వతి వుంటారు. అన్ని సీజన్ల లోను భక్తులు వస్తారు. ఇక్కడ కల ప్రశాంత వాతావరణం లో భక్తులు ధ్యానాన్ని కూడా చేస్తారు.