సెయింట్ మేరీ చర్చి 1902 లో బ్రిటిష్ పాలనలో గుల్మార్గ్ కు సమీపంలో నిర్మించారు. బ్రిటిష్ శిల్ప శైలి లో నిర్మించిన ఈ చర్చికి పర్యాటకులు అధిక సంఖ్య లో వస్తారు. 110 సంవత్సరాల ఈ పురాతన చర్చి ఇండియాలో బ్రిటిష్ పాలనకు ఒక వారసత్వ ప్రదేశం గా భావిస్తారు.
చర్చి చుట్టూ అనేక గుడిసెలు, హోటళ్లు వుంటాయి. అన్నీ కూడా బ్రిటిష్ శిల్ప శైలి లోనో వుంటాయి. ఈ ప్రదేశం లోని ఆల్పైన్ చెట్లు మరింత ఆకర్షణగా వుంటాయి. ఈ చర్చి సమీపం లోనే ఒక మసీదు, ఒక గుడి, గురుద్వారా లు కూడా కలవు.