మధ్యప్రదేశ్ లో ని జబల్పూర్ నగరం నుండి 13 కిలో మీటర్ల దూరం లో ఉన్న భేదాఘాట్ రోడ్డు పై తేవర్ గ్రామం లో ఈ ఆలయం ఉంది. జబల్పూర్ యొక్క ప్రధాన ఆకర్షణలలో ఈ ఆలయం పవిత్రమైన ప్రసిద్ద క్షేత్రం. 11 వ శతాబ్దం లో నిర్మితమైన ఈ ఆలయం లో ఉన్న విగ్రహం భూమి నుండి ఉద్భవించినదని అంటారు. త్రిపుర అంటే మూడు నగరాలూ అని అర్ధం సుందరి అంటే అందమైన అతివ అని అర్ధం.
అందువల్ల ఈ ఆలయానికి మూడు నగరాలకి చెందిన దేవతల ఆలయం అని అర్ధం వచ్చేటట్లు పేరు వచ్చింది. అందువల్ల, అమ్మవారి మూడు రూపాలు గురించి వివరణ శక్తి మతస్తుల సిద్దాంతం ప్రకారం సామర్ధ్యం మరియు శక్తిని ఈ దేవతకి ప్రతిరూపంగా సూచిస్తుంది. ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు ప్రత్యేకించి దసరా పర్వదినాలలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక సాధువులు మరియు గురువులు ఈ దేవాలయాన్ని అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ప్రదేశం గా భావిస్తారు.



Click it and Unblock the Notifications