11 వ శతాబ్దానికి చెందిన జబల్పూర్ పాలకులు కొన్నేళ్ళ పాటు నివసించిన ప్రాంతం మధ్య ప్రదేశ్ లో జబల్పూర్ లో ఉన్న మదన్ మహల్ ఫోర్ట్. కొండపై ఉన్న ఈ కోట నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరం లో ఉంది. రాజ మదన్ సింగ్ చేత ఈ కోట నిర్మించబడినది. సాహసోపేతమైన గండ్ పాలకురాలు అయిన రాజమాత రాణి దుర్గావతి తో ఈ పాలసు కి అనుబంధం ఉంది.
ప్రస్తుతం శిధిలావస్తలో ఉన్న ఈ కోట రాణి దుర్గావతి యొక్క సౌరభాన్ని అలాగే ఆవిడ పాలకా యంత్రాంగం మరియు సైన్యం గురించి తెలుపుతుంది. ఈ కోటలో రాచరికపు వంశం యొక్క ఇష్టమైన ప్రాంతాలు వార్ రూమ్స్ మరియు చిన్న రిజర్వాయర్ ఇంకా ఆశ్వ శాల పర్యాటకులు చూడదగ్గవి. పూర్వకాలపు మనుషుల యొక్క జీవన విధానం గురించి ఈ కోట తెలుపుతుంది.
అంతే కాకుండా, ఆ కాలం లో ని రాచరికపు వ్యవస్థ గురించి తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. భారత దేశం లో ఉన్న ప్రాచీన వ్యూహాత్మక స్మారక చిహ్నాలలో మదన్ మహల్ ఫోర్ట్ ఒకటి. జబల్పూర్ ని సందర్శించేటప్పుడు ఈ కోట ని తప్పక సందర్శించి తీరాలి.