సియోనీ అదే పేరు గల జిల్లాలో వుండే అందమైన పట్టణం. ఈ ప్రశాంతమైన పట్టణం మధ్య ప్రదేశ్ లోని సాత్పురా మైదాన ప్రాంతంలోని వాయువ్య భాగంలో వుంది. 8758 చదరపు కిలోమీటర్ల సుదీర్ఘ భౌగోళిక ప్రాంతాన్ని ఆవరించి వుండే సియోనీ జిల్లా 1956 నవంబర్ ఒకటో తేదీన ఏర్పడింది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయానికి వెయిన్ గంగా నది ఊతం ఇస్తుంది.
సియోనీ గురించి ఆసక్తికరమైన నిజాలు
ఇతిహాసాల ప్రకారం జగద్గురువులు శంకరాచార్యులు ఈ దారి వెంట కేరళ వెళ్తూ ఈ అందమైన పట్టణాన్ని చూసి దీనికి శిరోని అని పేరు పెట్టారు, అదే తరువాత శివ నగరిగా ప్రసిద్ది చెంది తరువాత సియోనీ అయింది. రడ్యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్ లో కథ అంతా ఈ ప్రాంతం లో జరిగేసరికి ఇది ప్రసిద్ది చెందింది. అయితే రడ్యార్డ్ కిప్లింగ్ పుస్తకంలో దీన్ని సీయోనీ అని వ్యవహరించారు.
ఇక్కడ దొరికే వేర్బనాలియాల్ జాతి కి చెందిన సియోనా చెట్టు వల్ల కూడా సియోనీ అనే పేరు వచ్చిందంటారు. దీని నుంచి తీసిన చెక్క తో డోలక్ లు తయారు చేస్తారు. అంతేకాక సియోనీ లో తయారయ్యే ఇంకో ప్రసిద్ధ రకం కలప టేకు.
సియోనీ లోను, పరిసరాలలోనూ పర్యాటక ప్రదేశాలు
సియోనీ పర్యాటకం చాప్రా లో వెయిన్ గంగా నది ఒడ్డున వున్న ఆసియా లోని అతి పెద్ద మట్టి ఆనకట్ట అయిన భీమ ఘర్ సంజయ్ సరోవర్ డ్యాం ను అందిస్తుంది. దీని ప్రధాన ప్రయోజనం వ్యవసాయం. సియోనీ జిల్లాలోని మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ పెంచ్ పులుల అభయారణ్యం. సారవంతమైన లోయలు, అందమైన పరిసరాలకు ప్రసిద్ది గాంచిన బార్ఘాట్ అనే చిన్న పట్టణం కూడా సియోనీ జిల్లాలో చూడదగ్గ ప్రదేశం. కాంపింగ్, ట్రెక్కింగ్ లాంటి బహిరంగ కార్యకలాపాలు ఇష్టపడే వారు బార్ఘాట్ సందర్శించాలి.
మహాకాళేశ్వర్ దేవాలయం, శివాలయం, ఆమోద ఘర్ లాంటివి సియోనీ లోని ఇతర ఆకర్షణలు.
సియోనీ కి ప్రయాణించడం
సియోనీ సందర్శన శీతాకాలంలో చేయడం మంచిది. రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా ఈ ప్రాంతం బాగా అనుసంధానించబడి వుంది.