దిఘోరి అనే గ్రామంలో వున్న మహాకాళేశ్వర్ దేవాలయం చాలా ప్రసిద్ది పొందింది. ఈ చిన్ని గ్రామం సియోనీ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో వుంది. సుమారు క్రీ.శ.8 వ శతాబ్దంలో ఈ ప్రాచీన దేవాలయాన్ని ఆదిశంకరాచార్యుల వారు నిర్మించారు. ఇది శివాలయం. ఈ గుడి హిందువులకు చాలా ముఖ్యమైనది, కుల మతాలకు అతీతంగా ఈ దేవాలయానికి వచ్చి దేవుని ఆశీస్సులు కోరతారు. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణీకులు తేలిగ్గానే ఇక్కడికి చేరుకోవచ్చు.