సియోనీ జిల్లాలో, ఇక్కడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో వున్న కాటల్ బోడి అనే గ్రామంలో సుప్రసిద్ధ సియోనీ దేవాలయం వుంది. ఆది శంకరాచార్యుల వారి స్మృత్యర్ధం 2003 లో ఈ గుడిని నిర్మించారు. ఒక అందమైన ప్రదేశంలో వున్న ఈ దేవాలయాన్ని చూసి తీరవలసిందే. భక్తులకు ఈ దేవాలయం పట్ల చాలా భక్తీ విశ్వాసాలు వున్నాయి. స్థానికుల్లోనే కాక పర్యాటకుల్లో కూడా ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది. ఈ గుడి కట్టిన నాటినుంచి కూడా సియోనీ సందర్శించే ప్రజలు ఈ గుడిని కూడా చూసి వస్తున్నారు. ఈ అందమైన గుడిలోని వాతావరణం భక్తీ భావాలను పెంపొందిస్తుంది.