మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడి పేరిట ఏర్పడ్డ బిలాస్ పూర్ పట్టణం హర్యానా లోని యమునా నగర్ జిల్లాలో వుంది. ఈ చారిత్రిక పట్టణంలో కొన్ని కథనాల ప్రకారం ఒక సరస్సు ఒడ్డున వేదం వ్యాసుడి ఆశ్రమం వుండేది.చాలా పవిత్రమైనవిగా భావించే రుణ మోచన్, కపాల్ మోచన్, సూర్య కుండ్ లాంటి పవిత్రమైన సరస్సులో చాలా బిలాస్ పూర్ లో వున్నాయి. ఆధ్యాత్మిక పురోగతి కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఈ సరస్సులో మునక వేస్తారు.ఈ సరస్సులే కాక బిలాస్ పూర్ పట్టణం లో వున్న 9-10 శతాబ్దాలలో నిర్మించారని చెప్పబడే ఉమా మహాదేవ విగ్రహానికి కూడా ప్రసిద్ది చెందింది. 11-12 శతాబ్దాలకు చెందిందని భావించే వినాయకుడి విగ్రహం కూడా ఇక్కడ వుంది. ఈ పట్టణంలో గుప్తా సామ్రాజ్యాన్ని కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications