ఒడిశా లోను, తూర్పు కనుమలు మొత్తంలోనూ అతి ఎత్తైన దేవమాలి శిఖరం సముద్ర మట్టానికి 1672 మీటర్ల ఎత్తున వుంది. ఇది జయపూర్ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో వుంది.
గుసగుసలాడే సెలయేళ్ళు, లోతైన లోయలు, దట్టమైన అడవులు, మధ్యలో వుండే మైదానాలతో అలరారే ఈ ప్రదేశంలో ఫల, వృక్ష జాతులు పుష్కలంగా వున్నాయి. మాలి తెగ తో పాటు, భూనియా, భోత్రా, పరజా లాంటి ఇతర తెగలకు కూడా దేవమాలి నిలయం. హాంగ్ గ్లైడింగ్, ట్రెక్కింగ్, పర్వతారోహణ లాంటి క్రీడల కోసం సాహస ప్రియులు ఇక్కడికి వస్తుంటారు.
దేవమాలి లోని సొరంగాల గుండా వెళ్ళే రైలు పట్టాల నుంచి ఎత్తైన కొండలు, లోయలను చూడడం ఈ ప్రాంతం అందాల్ని మరింత ఇనుమడింప చేస్తుంది. ఈ సవారీ చాలా ఉత్కంఠ భరితంగా, చూడదగ్గవిగా వుంటుంది.
రోడ్డు సవారీలు కూడా చాలా గుడ్డి మలుపులతో, కొండల పైనుంచి దిగుతున్నట్టుగా వుండే దారులతో చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. జయపూర్ వెళ్ళే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తప్పక చూడాలి.