1982 లో నిర్మింపబడిన ఈ భగవాన్ మహావీర్ మ్యూజియం కడప లో తప్పక సందర్శించవలసిన ప్రాంతం. ఈ మ్యుజియం , నిర్మాణం కోసం భారీ విరాళాలు జైన్ సంఘం ఏర్పాటు చేసింది. ప్రాచీన కళాకృతులు అలాగే జైన మతానికి సంబంధించిన నిర్మాణ కళ లు ఈ మ్యూజియం లో గమనించవచ్చు.
ఈ మ్యూజియం లో రాతి నుండి చెక్కబడిన శిల్పాలు, కాంస్యం తో తయారు చేయబడిన చిహ్నాలు, మట్టితో చేయబడిన బొమ్మలు, శాసనాలతో ఉన్న రాళ్ళు ఇలా ఎన్నో ఈ మ్యూజియం లో గమనించవచ్చు. ఇవన్నీ భారత దేశం లో జైన మతం వృద్ది చెందుతున్న సమయంలోని ప్రాచీన కాలానికి చెందినవి. క్రీస్తు శకం అయిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు పట్టణాలుగా వర్ధిల్లిన నందలూర్, గుండ్లూరు, తిమ్మాయపాలెం, అత్తిరాల, మంతమపంపల్లీ, పోలి, కొలతుర్, అలాగే మరెన్నో ప్రాంతాలనుండి సేకరించిన వస్తువులను ఈ మ్యూజియం లో గమనించవచ్చు. పురావస్తు శాఖ తవ్వ కాలలో బయట పడిన కళాకృతులని భగవాన్ మహావీర్ మ్యూజియం లో భద్రపరిచేందుకు కడపకి తీసుకువచ్చారు.
ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు, జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం, శివుని తలపై నుండి కాకుండా పక్క నుండి పారుతున్న గంగతో శివుని విగ్రహం వంటి కొన్ని అరుదైన కళాకృతులు ఈ మ్యూజియం లో గమనించవచ్చు.



Click it and Unblock the Notifications