దక్షిణ భారత దేశం లో అత్యంత ప్రాచీనత పొందిన దెన్ తిరుపతి, అరియక్కుడి ఆలయం, కరైకుడి నుండి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ ఆలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుండడం వల్ల ప్రజలలో అత్యంత ఖ్యాతి గడించింది. తిరువేంకటాముదయన్ గా ఇక్కడి వెంకటేశ్వరస్వామి పిలువబడతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి నివాస స్థలం గా పరిగణించబడే ఈ ఆలయం లో చేసే ప్రార్ధనలు సాక్షాత్తు తిరుపతి లో ప్రార్ధనలు చేసేంత ఫలితం ఇస్తాయని భక్తుల నమ్మకం. అందువల్ల ఈ ఆలయాన్ని తేన తిరుపతి లేదా దక్షిణ తిరుపతి గా పిలుస్తారు.
ప్రాచీన ఆలయం అయిన దెన్ తిరుపతి నిర్మాణం లో కలిగిన కొన్ని సమస్యల వల్ల ఇటివలే దీనిని పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని రక్షించడం కోసం చేసిన పునర్నిర్మాణం వల్ల తన అసలు స్వరూపం ఈ ఆలయం కోల్పోయింది. ఈ ఆలయం లోపల ఉత్తరం దిక్కున ప్రతిష్టింపబడిన గరుడ విగ్రహాన్ని కల్గరుడన్ అని అంటారు.
ప్రతి రోజు, ప్రత్యెక మైన పూజ ఈ ఆలయం లో నిర్వహిస్తారు. పూజ సమయానికి ఇక్కడికి చేరుకునేల ఎంతో మంది భక్తులు అలాగే పర్యాటకులు ప్రయత్నిస్తారు.