శివనగై జిల్లాల్లో ఒకటైన కండనూర్ ప్రాంతం లో ఈ శివ టెంపుల్ ఉంది. కరైకుడి నుండి 7 కిలోమీటర్ల దూరం లో కండనూర్ ఉంది. ఈ రెండు ప్రదేశాలకి ఎన్నో బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
శివపార్వతుల కి అంకితమివ్వబడిన ఈ ఆలయం కండనూర్ ప్రజలలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత సంతరించుకుంది. వారి జీవితం లో జరిగే కొన్ని శుభప్రదమైన ఆనందకరమైన సంఘటనలను ఈ ఆలయం లో జరుపుకుంటారు. ఈ ఆలయం నుండి ఊరేగింపు తో ఆ వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదాహరణకి, పెళ్లి ఊరేగింపులు ఈ ఆలయం నుండే ప్రారంభమవుతాయి. ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళే వారు మొదటగా ఈ ఆలయాన్ని సందర్శించి నమస్కారం చేసి ఆ తరువాత బస్సు ఎక్కుతారు.
ప్రశాంతమైన అనుభూతిని కలిగించే ఈ ఆలయం విశాలమైన ప్రదేశం లో నిర్మించబడింది. ఎంతో మంది భక్తులు భగవంతుని సన్నిధిలో గడపడానికి ఇక్కడికి చేరుకుంటారు. ప్రశాంతమైన, పవిత్రమైన వాతావరణం వల్ల ఎంతో మంది భక్తులు ఈ ప్రాంతం లో ధ్యానం చెయ్యడానికి ఇక్కడికి చేరుకుంటారు.