నారాయణపూర్, ఖమ్టి గ్రామంలో బాపుచంగ్ ఒక బౌద్ధ ఆలయం. అస్సాం లోని లఖింపూర్ జిల్లాలో ఇది ఉంది. కాజీరంగా జాతీయ పార్కు నుండి బాపుచంగ్ 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచం నలుమూలల కనబడే బౌద్ధ ఆలయాలనే ఈ ఆలయం కూడ చాలా వరకు పోలి ఉంటుంది. ఈ కారణంగానే సాధారణ ఖమ్టి వాస్తుకు పూర్తిగా భిన్నంగా, ఈ భాగంలో కనబడే ఆలయ వాస్తు ఉంటుంది. వెలుపల వైపు వాస్తు శైలి చాల వరకు మయన్మార్ లోని బౌద్ధ బిహారీలను పోలి ఉండటం మనం గమనించవచ్చు.
బాపుచంగ్ లో అనేక బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఈ చిన్న ఖమ్టి గ్రామాన్ని ప్రతి ఏటా గణనీయమైన సంఖ్యలో భక్తులు సందర్శించడం చూడవచ్చు. కాజీరంగా సమీపంలో ఉండటం దీనిని ఇంకా ఎంతగానో ప్రసిద్ధి పొందించింది. జాతీయ పార్కును ఆనుకొని ఉన్న ప్రాంతాలకు ఒక చిన్న పర్యటనలో భాగంగా బాపుచంగ్ కు కూడా మార్గదర్శకాలతో కాజీరంగా లోని దియోతల వెలికితీసిన విగ్రహం మఘ్నవో దౌల్ ను ప్రస్తుతం స్థాపించిన ప్రదేశమే దియోతల. మాన్ ల దండయాత్ర కాలంలో, పురాతన మఘ్నవో దౌల్ విగ్రహాన్ని నాశనం కాకుండా కాపాడటానికి దాచిపెట్టారు. ఈ దాచిన విగ్రహాన్ని ఖేర్జఖట్ లోని గావోరు బీల్ నుండి వెలికితీశారు.
దానిని వెలికితీసిన తర్వాత గావోరు బీల్ నుండి తీసుకొని వచ్చి అప్పట్లో బోర్-కలైక థాన్ గా పిలిచిన దియోతలలో ప్రతిష్టించారు. దియోతల అనే పదానికి సాహిత్యపరంగా – ‘దియో’ – దేవుడు, ‘తోల’ – తీయడం అనే అర్ధం ఉంది. లఖింపూర్ జిల్లాలోని నారాయణపూర్ నుండి దియోతల 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాజీరంగా జాతీయ పార్కు నుండి నారాయణపూర్ 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో విస్తారమైన వాస్తు గాని లేదా ఇంకా సాధారణ అంచనాలను మించి గాని ఏమి ఉండదు. కాని ఇది నిర్మలంగా తన ప్రత్యేక మార్గంలో అంద౦గా ఉంటుంది.
మఘ్నవో దౌల్ సందర్శించే భక్తులు దౌల్ సందర్శించి విగ్రహాన్ని చూడక పోతే పర్యటన అసంపూర్తిగా ఉంటుందని తప్పని సరిగా దియోతల కూడా చూస్తారు. మఘ్నవో దౌల్ కూడా, కాజీరంగా జాతీయ పార్కు దగ్గరలో ఉంది.



Click it and Unblock the Notifications