మస్తాఫ్డ్ మిల్కీ వే ఆక్వా టూరిస్ట్ విలేజ్, ఎర్నాకుళం కి 12 కి మీ ల దూరంలో ఉన్న వైపిన్ లో ఉన్న మలిప్పురం వద్ద నెలకొని ఉన్నది. ఈ ఊరు చేపల పెంపకంతో ఎకో ఫ్రెండ్లీ గా గుర్తింపు పొందినది. ప్రశాంతమైన వాతావరణంలో ఫిషింగ్ ని ఆనందించవచ్చు.
ఈ ప్రాంతం గోశ్రీ బ్రిడ్జి ద్వారా అనుసంధానమై ఉంది. పిక్నిక్ కి మిల్కీ వే అనువైన ప్రదేశం. ఈ పార్కులో ఉన్న ఎన్నో రెస్టారెంట్లలో నోరూరించే ఎన్నో రుచులు ఆహ్వానం పలుకుతాయి. కోస్టల్ రెగులేషన్ జోన్ లో కి ఈ మిల్కీ వే ఆక్వా టూరిస్ట్ విలేజ్ వస్తుంది. అద్బుతమైన, నిర్మలమైన ఈ ప్రదేశం మంచి అనుభూతిని కలిగిస్తుంది.
ఒక బీచ్ ఈ ఫార్మ్ కి అనుసంధానమై ఉంది. రోజువారి దైనందిన జీవన విధానం లో నుండి బయటకు తీసుకువచ్చి సందర్శకులకి అద్బుతమైన అనుభూతిని కలిగించేందుకు ఈ కాలుష్య రహిత వాతావరణం తోడ్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్నదట్టమైన మడ అడవులని రక్షించడానికి ఏంతో కృషి చేస్తున్నందువల్ల ఇక్కడున్న వాతావరణం ఆహ్లాదదాయకంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం తో మిల్కీ వే ఆహ్వానం పలుకుతోంది. సేద తీరడానికి అనువైన ప్రదేశం.