రాష్ట్రంలో ని అతి పెద్ద పురావస్తు మ్యూజీయంగా ఈ హిల్ పాలస్ కి విలక్షణమైన స్థానం ఉంది. కొచ్చి లోని ఒక ప్రాంతమైన త్రిపునితుర లో ఈ పాలస్ ఉంది. ఈ పాలస్ ని 1865 లో నిర్మించిన తర్వాత కొచ్చి ని పరిపాలించిన రాజులు పరిపాలనా కార్యాలయంగా ఉపయోగించేవారు. 49 భవనాల కాంప్లెక్స్ ఈ పాలస్.
సమకాలీన నిర్మాణ శైలి ని దృష్టిలో పెట్టుకుని ఈ పాలస్ ని నిర్మించారు. సంస్కృతీ, సంప్రదాయాలకు ఈ భవనాలు ఒక ఉదాహరణ. ఈ కాంప్లెక్స్ లో ఒక పురావస్తు మ్యూజియం, పిల్లల పార్కు, జింకల పార్కు, ప్రీ హిస్టారిక్ పార్కు మరియు చారిత్రక మ్యూజియం ఉన్నాయి. వీటితో పాటు, కొన్ని అరుదైన సుగంధ ద్రవ్యాల మొక్కలు మరియు మూళికలు ఈ కాంపౌండ్ లో పెంచుతున్నారు.
ఈ మ్యూజియం ని పరిరక్షించే బాధ్యత కేరళ రాష్ట్ర పురావస్తు శాఖది. పురావస్తు శాఖ అద్బుతమైన పనితనాన్ని కనబరచి ఈ మ్యూజియంలోని వాస్తవికతలోని నిర్మాణ శైలిని చెక్కు చెదరని విధంగా పరిరక్షించారు. ఈ పాలస్ ని ప్రజలు సందర్శించే సదుపాయం కూడా కల్పించారు. 'మనిచిత్రతజు' అనే మలయాళం సినిమాలోని కొన్ని ప్రసిద్ద సన్నివేశాలు ఈ హిల్ పాలస్ లో నే చిత్రీకరించారు.