కొచ్చి నగరంలోకి వచ్చే ఒక ప్రాంతం వెల్లింగ్టన్ ఐలాండ్. నేడు ఈ ద్వీపం కొచ్చిసరస్సు లోని భూభాగం మీద నెలకొని ఉంది. సరస్సులో కొంత భాగాన్ని ఇసుకతో నింపి ఈ ఐలాండ్ ని సృష్టించడానికి ఏంతో కృషి చేసారు. ఈ ప్రాంతం కొచ్చిలో ని ఓడరేవులో చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశం అవ్వటం వల్ల ప్రాముఖ్యత సంతరించుకుంది.
కొచ్చి, భారత సైన్యానికి నావికాదళ స్థావరం అవడం కూడా వెల్లింగ్టన్ ఐలాండ్ ప్రాముఖ్యతను పెంచుతుంది. ఈ ఐలాండ్ 1936 లో వెంబనంద్ సరస్సు పై నిర్మించారు. కొచ్చీ లో ని కొత్త నౌకాశ్రయం ఏర్పాటు చెయ్యడానికి ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైనది. తాజ్ మలబార్ వంటి ప్రసిద్డ్డ మైన హోటల్స్ ఎన్నో వెల్లింగ్టన్ ఐలాండ్ లో ఉన్నాయి. ద్వీపం లో ని సుందరమైన ప్రాంతంలో సముద్రం ముఖద్వారం వద్ద నిర్మించిన స్విమ్మింగ్ పూల్ సౌలభ్యం ఈ హోటల్లో ఉంది.