కొచ్చి పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా శాంతా క్రూజ్ కేథడ్రల్ బసిలికా ని చెప్పుకోనవచ్చును. భారత దేశం లో ని మొట్ట మొదటి చర్చిల లో ని ఒకటిగా ఉన్న ఈ కేథడ్రాల్ ఫోర్ట్ కొచ్చి లో ఉంది. దేశం లో ఉన్న ఎనిమిది బాసిలికాలలో ఇది ఒకటి. భారత పురావస్తు శాఖ వారు ఈ చర్చ్ మరియు ఈ హెరిటేజ్ భవనం యొక్క వాస్తవికతను కాపాడడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ భవనం నిర్మాణ మరియు వైభవం యొక్క అత్యుత్తమ కలయిక. మధ్య యుగ ప్రభావం కల కొన్ని భవనాలలో ఒకటిగా ఈ భవనాన్ని చెప్పుకోవచ్చు. కాథలిక్ భవనాలని కూల్చి వేసిన డచ్ వారి చేతిలోంచి రక్షింపబడిన కొన్ని భవనాలలో ఈ భవనం కూడా ఉంది. ఈ భవనం లో ఉన్న కాన్వాస్ చిత్రాలు మరియు గోడలపై చిత్రింపబడిన చిత్రాలు క్రీస్తు పుట్టుక మరియు మరణానికి సంబంధించిన కథలు వివరిస్తాయి. చివరి సప్పర్ గురించి వివరించబడిన చిత్రం ఈ చర్చ్ కి ప్రధాన ఆకర్షణ.