భారత దేశం లో ని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటైన సంతాన గోపాల కృష్ణ స్వామి టెంపుల్ కొచ్చి లో ఉంది. ఈ గుడి 947 AD కి సంబంధించినదని గుడిపై కనిపించే శాసనాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ దక్షిణాది గుడికి ఏంతో మంది సందర్శకులు తరలి రావడానికి ఈ విషయం కూడా ప్రధాన కారణం.
అనేక యుగాల చరిత్ర కలిగిన సంతాన గోపాల కృష్ణస్వామి టెంపుల్ ఎర్నాకుళం నగరానికి 8 కి మీ ల దూరంలో ఉంది. గుడిమీద అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు, గుడి వెలుపల మరియు బయట కనిపించే సంపన్నమైన పురాతన సంస్కృతి చరిత్ర పైన మమకారం కలిగిన ప్రతి సందర్శకుడిని సంతృప్తిపరుస్తాయి. ఈ గుడిలో విష్ణు మూర్తి అవతారమైన సంతానగోపాల స్వామి కొలువై ఉంటాడు.
సంతానగోపాలమూర్తి అంటే శిశువుల ని రక్షించే దేవుడు అని అర్ధం. ఈ టెంపుల్ కి చేరడానికి ఎన్నో బస్సు లు నగరం నుండి అందుబాటులో ఉన్నాయి. తరచూ ఎన్నో బస్సులు ఏంతో మంది భక్తజను లని ఈ గుడి కి చేరుస్తూ ఉంటాయి.