కొల్లాం కి 10 కి.మి. దూరం లో ఉన్న చిన్న సుందరమైన గ్రామమిది. కొల్లాం నుంచీ, కొట్టాయం నుంచీ బస్సు సౌకర్యం కలిగిన ఈ చిన్న గ్రామం పరవూర్ సరస్సు దగ్గర్లో ఉంది. ఈ గ్రామంలో అరేబియా సముద్రానికి సమాంతరంగా గల పొడవాటి తీర ప్రాంతం చేపలు పట్టడం వంటి సముద్ర కార్యకలాపాలకి ప్రసిద్ది.
అయితే ఈ ప్రాంతం లోని గుడులు గోపురాల వల్ల ఏర్పడ్డ సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ ప్రాంతానికి ఎక్కువ పేరు తెచ్చింది. కళాది శ్రీ శంకరాచార్య చే స్థాపించిందిగా భావించబడుతున్న ఉమయనల్లోర్ లోని సుబ్రమణ్య గుడి , ఇక్కడి ముఖ్య మత కేంద్రం. కేరళ కౌముది అనే మళయాల డైలీ కి పుట్టిల్లు కావడం వల్ల ఈ ప్రాంతానికి సాహిత్య, ప్రచార మాధ్య చరిత్రలోనూ స్థానం దక్కింది.