సింధు నది లోయలో ఉన్న మాతో ఆరామం, నగరం నుండి 16 కి.మీల దూరంలో ఉంది. దీనికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. లడఖ్ యొక్క శాక్య సన్యాస వ్యవస్థ చే నిర్వహించబడుతుంది. ఈ మఠం 16 వ శతాబ్దంలో లామా దుగ్ప దోర్జ్ చేత నిర్మించబడింది. నాలుగు వందల సంవత్సరాల తంగ్కాలు లేదా మతపరమైన టిబెటన్ పట్టు చిత్రాలు, మరియు దానికి సంబంధించిన మాతో నగ్రంగ్ పండుగ పర్యాటకులలో ప్రసిద్ధి చెందాయి. సందర్శకులు ఆరామం లోపల నిర్మించబడిన ప్రదర్శనశాలలో తంగ్కాల పురాతన సేకరణ మండలాల రూపంలో చూడగలరు. మఠం లోపల ఉన్న మందిరం సంరక్షక దేవతలను సూచిస్తుంది.
ఈ ప్రదేశం, బౌద్ధ విజ్ఞానం మరియు సిద్ధాంతాలు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అనువైనదని నమ్ముతారు. మాతో నగ్రంగ్ పండుగ సమయంలో పవిత్ర ఆచారాలు మరియు నృత్యాలు మార్చి మొదటి సగంలో ఈ మఠం లోనే నిర్వహిస్తారు. యాత్రికులు సులభంగా ఈ ప్రదేశం చేరుకోవడానికి టాక్సీలు మరియు కార్లు లభిస్తాయి.