17 వ శతాబ్దంలో నిర్మించబడిన సేర్జంగ్ ఆలయం, లేహ్ నుండి 40 కి.మీ ల దూరంలో ఉంది. యాత్రికులు లేహ్- శ్రీనగర్ ప్రధాన రహదారి గుండా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. బంగారం మరియు రాగి విస్తృతంగా నిర్మాణంలో ఉపయోగించటం, ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం. 30 అడుగుల పొడవైన, భవిష్యత్ బుద్ధ లేదా నవ్వే బుద్ధ గా పిలవబడే మైత్రేయ బుద్ధ విగ్రహం ఈ ఆలయంలో ఉంది. తిలోప, మార్ప, మీలా రాస్ప మరియు నరోప ఈ ఆలయం లో ఉంచబడిన అద్భుతమైన చిత్రాలలో కొన్ని. బుద్ధుని రూపాలు మరియు ఎరుపు టోపీ శాఖకు చెందిన ప్రజలు రూపాలు ఆలయ గోడలు పై చిత్రించబడి ఉన్నాయి. ఈ దేవాలయం ఎన్నో ఏళ్ళగా సేర్జంగ్ వ్రాతప్రతికి ఆవాసంగా ఉంది. సేర్జంగ్ వ్రాతప్రతి టిబెట్ బౌద్ధ సిద్ధాంతంకి నకలు. దీనిలో టిబెట్ బౌద్ధం గుర్తించే వివిధ శాఖల అన్ని పవిత్ర గ్రంథాలు బంగారం, వెండి మరియు రాగి అక్షరాలతో వ్రాయబడి ఉన్నాయి.