17 వ శతాబ్దంలో నిర్మించబడిన సేర్జంగ్ ఆలయం, లేహ్ నుండి 40 కి.మీ ల దూరంలో ఉంది. యాత్రికులు లేహ్- శ్రీనగర్ ప్రధాన రహదారి గుండా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. బంగారం మరియు రాగి విస్తృతంగా నిర్మాణంలో ఉపయోగించటం, ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం. 30 అడుగుల పొడవైన, భవిష్యత్ బుద్ధ లేదా నవ్వే బుద్ధ గా పిలవబడే మైత్రేయ బుద్ధ విగ్రహం ఈ ఆలయంలో ఉంది. తిలోప, మార్ప, మీలా రాస్ప మరియు నరోప ఈ ఆలయం లో ఉంచబడిన అద్భుతమైన చిత్రాలలో కొన్ని. బుద్ధుని రూపాలు మరియు ఎరుపు టోపీ శాఖకు చెందిన ప్రజలు రూపాలు ఆలయ గోడలు పై చిత్రించబడి ఉన్నాయి. ఈ దేవాలయం ఎన్నో ఏళ్ళగా సేర్జంగ్ వ్రాతప్రతికి ఆవాసంగా ఉంది. సేర్జంగ్ వ్రాతప్రతి టిబెట్ బౌద్ధ సిద్ధాంతంకి నకలు. దీనిలో టిబెట్ బౌద్ధం గుర్తించే వివిధ శాఖల అన్ని పవిత్ర గ్రంథాలు బంగారం, వెండి మరియు రాగి అక్షరాలతో వ్రాయబడి ఉన్నాయి.



Click it and Unblock the Notifications