రాజా డెల్దోన్ నామ్గ్యాల్ స్థాపించిన షే గొంప, లేహ్ యొక్క దక్షిణ భాగం నుండి 15 కి.మీ ల దూరంలో ఉంది. ఈ గొంప లో లడఖ్ ప్రాంతంలోనే రెండవ అతి పెద్ద విగ్రహంగా పరిగణించబడుతున్న భారీ రాగి మరియు ప్రకాశవంతమైన బంగారం కలిసిన బుద్ద విగ్రహం ప్రతిష్టించారు. ఈ మఠం తన తండ్రి సింగే నామ్గ్యాల్ గౌరవార్ధం లాచెన్ పల్గ్యిగోన్ అని కూడా పిలవబడే రాజా డెల్దోన్ నామ్గ్యాల్ చే 1655 సంవత్సరం లో నిర్మించబడింది.
ప్రస్తుతం శిధిలమైన స్థితిలో ఉన్నా,పాత రోజుల్లో షే ని లడఖ్ వేసవి రాజధానిగా భావించేవారు. హేమిస్ ఆరామం సన్యాసులచే ఇప్పుడు ఈ గొంప నిర్వహించబడుతుంది.