టిబెట్ లోని కుంజుం లా గా పిలువబడే కుంజుం పాస్ కుంజుం పర్వత శ్రేణులలో ఉన్న ఎత్తైన పర్వత మార్గం. మనాలీ నుంచి 122 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4590 మీటర్ల ఎత్తులో ఈ మార్గం ఉంది. ఈ మార్గం కులూ లోయను, లాహౌల్ లోయను హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయకు కలుపుతుంది. దైవభక్తి గల యాత్రీకులు ఈ మార్గం పైనున్న దుర్గాదేవి గుడిని కూడా సందర్శించవచ్చు.
రోహతంగ్ పాస్ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాక గ్రంపూ దగ్గర కుడివైపు తిరిగితే కుంజుం పాస్ వస్తుంది. ఈ మార్గం గుండా వెళ్ళేటపుడు యాత్రికులు ప్రపంచంలోని రెండో అతిపెద్ద మంచుఖండం బారా-సిగ్రి ని కూడా చూడవచ్చు. బటాల్ సి.బి. లేదా చంద్ర-భాగా, మనాలీ, కీలాంగ్, దార్చ, బరలచ లా, సార్చు, టాంగ్ లాంగ్, పంగి లోయ కుంజుం పాస్ చుట్టుపక్కల ఉన్న ఇతర ఆకర్షణలు.



Click it and Unblock the Notifications