కిరతేశ్వర్ మహాదేవ మందిరం రంజిత్ నది ఒడ్డున ఉంది, ఇది పర్యాటకులలో ప్రార్ధనకు ప్రసిద్ధ ప్రదేశంగా ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయానికి హిందూ పురాణం మహాభారతానికి చెందినా అనేక కధలు ఉన్నాయి. ఈ ఆలయం పెల్లింగ్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది, గెయ్జింగ్, పెమయన్గ్త్సే నుండి కూడా తేలికగా చేరుకోవచ్చు.
ఈ ఆలయం బేల చతుర్దశి అనే పండుగకు కూడా ప్రసిద్ది చెందింది. ఈ బేల చతుర్దశి పండుగను ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య జరుపుకుంటారు. సాధారణంగా ఈ ఆలయానికి రాష్ట్రం మొత్తం నుండి, రాష్ట్రం లోని చుట్టుపక్కల ప్రదేశాల నుండి కూడా భక్తులు గుంపులుగా వస్తారు.
ఈ ఆలయానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణం ప్రకారం, అర్జునుని ప్రార్ధనకు, భక్తికి మెచ్చి శివుడు ఈ ప్రదేశంలో ప్రత్యక్షమై మహాభారత యుద్ధంలో వేటగాడుగా ఉంటానని ఆశీర్వదించి విజయం సాధిస్తారని చెప్పాడు.