మహాబలేశ్వర్ లో ప్రతాప్ ఘడ్ కోట ప్రధాన ఆకర్షణ. 1856లో నిర్మించిన ఈ కోట ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకొంది. ఈ కోట ఛత్రపతి శివాజీ ఆదేశాలతో మహాబలేశ్వర్ కు 20 కి.మీ.ల దూరంలో నిర్మించారు. ఈ కోటలో ఎన్నో రహస్య గదులు, ద్వారాలు నిండి ఉన్నాయి. ఈ ప్రదేశంలో అఫ్జల్ ఖాన్ మరణం ఒక ప్రధాన సంఘటన. ఇప్పటికి ఖాన్ సమాధి అక్కడే ఉంది. ప్రసిద్ధి చెందిన భవానీ ఆలయం కూడా ఇక్కడ కలదు. సమీపంలో ఒక శివాలయం కలదు. దూరం నుండి చూస్తే ఈ కోట ఒక గుండ్రటి ఆకారంకల కొండను తలపిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తున కలదు.