దుర్షీత్ అంబానది ఒడ్డునకల ఒక ప్రశాంత గ్రామం. ఈ ప్రదేశం పాలి మరియు మహాడ్ లలోని అష్టవినాయక దేవాలయాల మధ్య కలదు. ఈ ప్రదేశం సుమారుగా 42 ఎకరాల అటవీ భూమిలో విస్తరించి వుంది.
దుర్షీత్ సహ్యాద్రి కొండల శ్రేణిలో అందాలతో అలరారుతూంటుంది. జాతీయ రహదారికి సమీపంలో ఖోపోలి గ్రామానికి దగ్గరగా ఉంటుంది. ఈ పర్యాటక ప్రదేశం దట్టమైన మామిడి మరియు మహు చెట్ల అడవులు తో నిండి ఉంటుంది. నగర జీవన రణగొణ ధ్వనులతో విసుగెత్తిన వారికి ఈ ప్రదేశం చక్కటి వారాంతపు విశ్రాంతికి సరైన ఎంపికగా ఉంటుంది. ముంబై మరియు పూనే నగరాలకు ఈ ప్రదేశం సమీపంగా ఉండటంతో ఎల్లపుడూ పర్యాటకులను అధిక సంఖ్యలో పొందుతూంటుంది.
దుర్షీత్ - ఒక పచ్చని గ్రామంగంభీరంగా నిలబడే సహ్యాద్రి కొండల శ్రేణులలో కల దుర్షీత్ ప్రదేశం పచ్చని చెట్లతో అనేక పక్షులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల పక్షులు ఇక్కడి చెట్లపై గూళ్ళు కట్టి నివాసం ఉంటాయి. ఈ పక్షుల కూతలు వినసొంపుగా ఉంటాయి. ఇక్కడి గాలి ఏ మాత్రం కలుషితం లేక ఎంతో తాజాగా ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనమే.
చల్లటి తాజా గాలులు, కంటికింపైన పచ్చటి ప్రదేశాలు పర్యాటకులకు మరువలేని అనుభూతులు కలిగిస్తాయి. ఈ ప్రదేశ అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే వర్షాకాలం ఎంతో అనుకూలమైనది.
దుర్షీత్ లో చూడదగిన ప్రదేశాలు ఏవి? అద్భుత ప్రకృతి సౌందర్యంకల దుర్షీత్ ట్రెక్కర్లకు, వైల్డ్ లైఫ్ సఫారీలకు ఎంతో ప్రియమైన ప్రదేశం. ఇక్కడ గల పాలి గణపతి దేవాలయం మరియు మహాడ్ గణపతి దేవాలయాలు రెండూ తప్పక చూడదగిన మతపర ప్రదేశాలు. మీ భక్తి విశ్వాసాలను మరింత అధికం చేస్తాయి.
ఈ ప్రదేశం గురించిన మరో వాస్తవం ఏమంటే, దుర్షీత్ ప్రదేశం ఛత్రపతి శివాజీ మహారాజు కార్తాలాబ్ ఖాన్ తో యుంబర్ ఖిండ్ ప్రదేశం కొరకు యుద్ధం చేసినపుడు ఒక యుద్ద ప్రదేశంగా కలదు. దుర్షీత్ కు వాయు, రైలు, రోడ్డు ఏ మార్గంలో అయినా సరే చేరవచ్చు.