సముద్ర మట్టం నుండి 2200 మీటర్ల ఎత్తులో ఉన్న జన్జ్హేలి, హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటైనీరింగ్ మరియు స్కయింగ్ వంటి సాహసోపేతమైన క్రీడలకు ప్రసిద్ది. అంతే కాదు,ఈ ప్రాంతం లో అందుబాటులో ఉండే నైట్ సఫారి కూడా పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తోంది. మండి నుండి 67 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం లో షోజ, కర్సోగ్, షికారి దేవి టెంపుల్, చింది, కమరు నాగ టెంపుల్ మరియు రాంపూర్ వంటి ప్రాంతాలని అనుసంధానం చేసే ట్రెక్కింగ్ మార్గాలు ఎన్నో ఉన్నాయి.
బ్రిటిష్ వారు షిమ్లా కి బదులుగా ఈ ప్రాంతాన్ని తమ వేసవి రాజధానిగా చేసుకోవాలనుకున్నారని అంటారు. అయితే, జన్జ్హేలి పాలకుడి వల్ల బ్రిటిష్ వారి ఆశలు తీరలేదు.