ఆంధ్ర ప్రదేశ్ లోని పాపి కొండలు ప్రాకృతిక అందంలో కాశ్మీరుకు సమానమైనవి. మెదక్ కు చాల దగ్గరగా ఉన్న పాపికొండలు ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా భాగమే.
మొదట్లో ఈ పర్వతశ్రేణులను పాపిడి కొండలు అనేవారు, అంటే తెలుగులో విభజన అని అర్ధం. ఈ శ్రేణులు గోదావరి నదిలో కల్గించే విభజన వలన ఈ పేరును కల్గి ఉన్నాయి. పై నుండి వీటిని చూసినప్పుడు ఒక స్త్రీ తన జుట్టును విభజించే విధంగా ఉండటమే ఈ శ్రేణులకు ఆ పేరు రావడానికి కారణమని కొంత మంది ప్రజలు నమ్ముతారు.
మునివాటం వద్ద ఉండే అందమైన జలపాతాలకు ఈ కొండలు ప్రసిద్ది. ఇది ప్రశాంత, నిర్మలమైన వాతావరణం ఉన్న ఒక గిరిజన గ్రామం. చాలా మంది ప్రజలు ఈ జలపాతాల దగ్గరకు ప్రకృతితో కలసి పోవడానికి వస్తారు. ఈ ప్రాంతంలోని గిరిజన సమూహాలలో ఉండే వారు శాంతియుత ప్రజలు, ఇక్కడకు వచ్చే వారికి ఏ విధమైన హానిని కల్గించరు.
భద్రాచలం లేదా రాజమండ్రి నుండి బోట్ ద్వారా చేరడం సులువైన మార్గ౦. పాపికొండలలో విభిన్న జంతు, వృక్ష జాతులు ఉన్నాయి. పాపికొండలు వన్య ప్రాణి అభయారణ్యంలో విభిన్న పక్షులే కాక విస్తృత శ్రేణిలో పులులు, చిరుతలు, లేళ్ళు, హైనాలు, నక్కలు, మచ్చల జింకలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications