సెంట్రల్ నాగ పట్టినంలో సౌందర్య రాజ పెరుమాళ్ టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ లో విష్ణు మూర్తి అవతారం సౌందర్య రాజ విగ్రహం వుంటుంది. ఈ విగ్రహం బంగారం మరియు పచ్చలతో అలంకరించ బడి వుంటుంది. ఎంతో చరిత్ర కలిగిన పురాతన టెంపుల్ ఇది. ఇక్కడ ఆది శేష మరియు అతని భార్యల విగ్రహాలు కూడా టెంపుల్ లో వుంటాయి. టెంపుల్ ప్రవేశంలో గల రాజగోపురం 70 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. నాలుగు స్తంభాలతో ఒక మంటపం కూడా కలదు. ఇక్కడ సౌందర్య పుష్కరిణి మరియు వసంత మండపం అదనపు ఆకర్షణలు.