ఈ మసీదు సుమారు 330 సంవత్సరాల క్రిందట నిర్మించారు. దీనిని సర్వారాజ్ ఖాన్ అనబడే ఔరంగజేబు సైన్యంలోని ఉత్తమ మిలిటరీ ఆఫీసర్ గౌర
వార్ధం నిర్మించారు. బిలోలి ప్రాంతంలో ఉన్నతంగా నిలబడే ఈ మసీదు ఇక్కడ పురాతన కట్టడాల నిర్వహణకు ఉదాహరణగా నిలుస్తుంది. అయితే, 1960లలో ఒక మెరుపు పడటం కారణంగా దక్షిణ భాగం కూలింది. కాని వెంటనే దానిని పునరుద్ధరించారు.