అరుదైన పక్షిజాతుల విడిది కేంద్రం.. వేదంతంగల్!
వేదంతంగల్ యొక్క చిత్తడి నేలలు.. చిన్న చిన్న సరస్సులు.. వాటి ప్రత్యేక పర్యావరణ వ్యవస్థతో సమృద్ధిగా ఉన్న నీటి వనరులు అనేక రకాల పక్షులను ఆకర్షిస్తున్నాయి. అలా అక్కడి పచ్చని ప్రకృతి అందాలు పక్షిప్రేమికులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాయి.
తమిళనాడులోని చంగల్పట్టు జిల్లాలో ఈ పురాతన పక్షుల అభయారణ్యం వేదంతంగల్ పర్యావరణ సమతుల్యతకు మారుపేరుగా నిలుస్తోంది. కాంచీపురం పట్టణం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షి అభయారణ్యం అనేకరకాల వలసపక్షుల ఆవాసంగా పేరొందింది.
వేదంతంగల్ పక్షుల అభయారణ్య కేంద్ర ప్రాంతం చెన్నయి నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో 74 ఎకరాలలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతాన్ని బస్సు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. చెన్నయి నుంచి ఇక్కడికి చేరుకోవటానికి గంటన్నర సమయం పడుతుంది. శతాబ్దాల క్రితం, ఈ ప్రాంతాన్ని అప్పటి స్థానిక రాజులు, భూస్వాములు 'వేట' ప్రాంతంగా ఉపయోగించుకునేవారని చరిత్ర చెపుతోంది. వేదంతంగల్ అంటే తమిళ భాషలో "ది హామ్లెట్ ఆఫ్ ది హంటర్" అని అర్థం.
కేవలం 74 ఎకరాల విస్తీర్ణంతో ఇది దేశంలోనే అతి చిన్న పక్షుల అభయారణ్యం కూడా. ఇది 1700ల ప్రారంభంలో క్రీడల కోసం ప్రధానంగా వేటాడే ధనిక భూస్వాముల యొక్క ఇష్టమైన వేట స్థలం. వేదంతంగల్ యొక్క చిత్తడి నేలలు చిన్న సరస్సులు మరియు వాటి ప్రత్యేక పర్యావరణ వ్యవస్థతో సమృద్ధిగా ఉన్న నీటి వనరులు అనేక రకాల పక్షులను నేటికీ ఆకర్షిస్తోంది.
అభయారణ్యాన్ని కాపాడుతున్నారు
ఇక్కడ వ్యూహాత్మకంగా చిన్న సరస్సులతో వివిధ రకాల వలస పక్షులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. బ్రిటిష్ పాలనలో బర్డ్ సాంక్చురీగా మారింది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలోని ఆర్నిలాజికల్ ప్రాముఖ్యత గుర్తించారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బర్డ్ సాంక్చురీగా 19వ శతాబ్దం మధ్యలో ఉత్తర్వులు జారీ చేసింది. వేదంతంగల్ బర్డ్ సాంక్చురీ ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధాన కారణాలతో పర్యాటకులను, పక్షి శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది.
అందులో ఒకటి భారతదేశంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన మొట్టమొదటి బర్డ్ సాంక్చురి. కాగా, రెండవ కారణం పక్షుల సంరక్షణలో స్థానిక సంఘాల మధ్య భాగస్వామ్యం. స్థానికులు చాలా కాలంగా ఈ అభయారణ్యాన్ని కాపాడుతున్నారు. పక్షుల రెట్టలు తమ పంటలకు నీరందించేందుకు ఉపయోగించే నీటిలో నైట్రోజన్ స్థాయిని పెంచడంతోపాటు దిగుబడిని పెంచేందుకు, ఎరువుల వినియోగం తగ్గేందుకు దోహదపడుతుందన్న విషయం వారు గ్రహించారు.
దాదాపు 40,000 వలస పక్షులు ఇక్కడ సేద దీరుతాయి. వాటిలో కొన్ని అంతరించిపోతున్న జాతులు కూడా ఉన్నాయి. గూడు, ఆహారం మరియు సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం పక్షులు ఈ చిన్న స్వర్గానికి తరలి వస్తాయి. వీటిలో పిన్టెయిల్స్, గ్రే వాగ్టెయిల్స్, బ్లూ-వింగ్డ్ టీల్స్, స్పూన్ బిల్స్ మరియు కామన్ సాండ్పైపర్ ఉన్నాయి.
పక్షుల అభయారణ్యం ఏడాది పొడవునా తెరిచి ఉన్నప్పటికీ, దీనిని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి మార్చి వరకు. ఈ సీజన్ వలస పక్షులకు గూడు కట్టే కాలం మరియు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.