నీలగిరులలో దోద్దబెట్ట శిఖరం అతి పొడవైనది. కన్నడంలో దొడ్డ బెట్ట అంటే, పెద్ద కొండ అని అర్ధం చెపుతారు. ఇది సుమారు 8650 అడుగుల పొడవు వుంటుంది. ఊటీ సిటీ నుండి ఈ శిఖరం 9కి.మీ. ల దూరంలో ఊటీ - కోటగిరి రోడ్ లో కలదు. ఇక్కడ నుండి చాముండి హిల్స్ చక్కగా చూడవచ్చు. దోద్దబెట్ట శిఖరం నుండి కుల్కూడి, కట్ట దాడు మరియు హేకుబా శిఖరాలు కూడా చూడవచ్చు. ఈ మూడు శిఖరాలు ఉదగమండలంకు సమీపం. దోద్దబెట్ట శిఖరం వాస్తవంగా బల్లపరుపుగా వుండటం విశేషం. టూరిస్ట్ సీజన్లో ఏప్రిల్ మరియు మే నెలలలో సుమారు 3,500 మంది పర్యాటకులు రోజుకు దీనిని సందర్శిస్తారు. ఈ శిఖర ఆకర్షణ పెంచేందుకు ప్రభుత్వం ఇక్కడే శిఖరం పైన ఒక ఖగోళ అబ్సర్వేటరీ ఏర్పాటు చేసింది. ఇక్కడ రెండు టెలీస్కోప్ లు కలవు. వీటి నుండి పర్యాటకులు వాలీ దృశ్యాలు చూడవచ్చు.