చాలా అందమైనదిగా పరిగణించబడే, నాగ్ (త్రాచుపాము) ఆలయం, పట్నితోప్ లోని తప్పక చూడవలసిన ఆకర్షణ. కొండపైన ఉన్న ఈ ఆలయం, అన్ని వైపులా పర్వతాలచే చుట్టబడి ఉంది. అధిక భాగం చెక్కతో తయారు చేయబడిన ఈ మందిరం,600 సంవత్సరాల క్రితందిగా భావిస్తున్నారు. భక్తులు కేవలం పగలు మాత్రమే ఆలయం లో ప్రవేశించాలనేది ఇక్కడి నమ్మకం.
ప్రసిద్ధ నాగ పంచమి పండుగ సందర్భంగా, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆనందం మరియు శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయడానికి ఈ ఆలయంకి వస్తారు. ఆలయాన్ని సందర్శించిన వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరని భక్తులు చెప్తూ ఉంటారు. తీవ్రమైన చల్లని సాయంత్రాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న పర్యాటకులు, శీతాకాలంలో కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. సంవత్సరంలో ఈ సమయంలో, సాయంత్రం మరియు ఆ తర్వాత, పర్వతాలు దాదాపు ఎల్లప్పుడూ పొగమంచుతో కప్పబడి, దృష్టి గోచరత కేవలం 10 అడుగుల దాకా మందగిస్తుంది. అందువల్ల, సాధారణంగా, ఈ కాలంలో చాలా మంది ఇక్కడికి రారు.



Click it and Unblock the Notifications