ఇప్పుడు ఉన్న ఈ గౌతమీ గ్రంధాలయం వాసురయ గ్రంధ్రాలయం మరియు రత్నకవి గ్రంధాలయం ల సముదాయం. ఇవి రెండు చిన్న చిన్న గ్రంధాలయాలు కలుపబడ్డాయి. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటరత్నం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంధాలయం పేరు 1898 గా ఇవ్వబడింది, 1920 సంవత్సరంలో పేరు రిజిష్టరు చేయబడింది. లైబ్రరీ పుస్తకాలు మరియు అచ్చు ప్రతులు సేకరణ చాలా ఉంది. లైబ్రరీ లో అనేక అరుదైన పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ లో 60,000 పుస్తకాలు ఉన్నాయి. అనేక భాషల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. లైబ్రరీ గురువారం మరియు ప్రజా సెలవుదినాలు తప్ప, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.



Click it and Unblock the Notifications