వేణు వన అనేది శాంతంగా, ధ్యానం చేసుకోవడానికి వీలుండే కృత్రిమ వనం. బుద్ధుడి కోసం బింబిసార చక్రవర్తి నిర్మించిన అందమైన విడిది ఇది. వేణు వనం లో ఒక ఆశ్రమం కూడా వుంది.
రాజధాని నగరం రాజగిర్ ను మరింత ధృడంగా చేసేందుకు ఉద్దేశించింది సైక్లోపియన్ రాతి నిర్మాణం. పెద్ద సున్నపు రాళ్ళ బండలతో నిర్మించిన మైసీనియన్ నిర్మాణాలను గుర్తుకు తెచ్చే పెద్ద రాతి గోడ ఇది. మౌర్యుల కాలానికి పూర్వానికి చెందిన ఈ నిర్మాణం అప్పటి వైభవ౦తో లేదు గానీ, ఆ వైభవ...
ఘనమైన చరిత్ర కల సొన్ భండార్ గుహలు చాలా ప్రధాన ఘట్టాలకు సాక్షిగా నిలిచాయి. ప్రధానంగా రెండు గుహల ఈ నిర్మాణంలో ఒకటి భద్రతా గది కాగా మరోటి నిధి వుండే గది అని చెప్తారు.
ఇప్పటికీ ఎవరూ చేరుకొని బి౦బిసారుడి నిధికి ఈ గుహలు దారి తీస్తాయని ఒక కథ ప్రచారంలో వుంది....
మగధ రాజ్యాన్నేలిన అజాతశత్రువు అజాత శత్రు కోట నిర్మించాడు. తనదైన ప్రత్యేకమైన శైలిలో వుండే ఈ కోటను చూసి తీరాల్సినది.
శాంతి గోపురంగా పిలువబడే విశ్వ శాంతి స్తూపం ఒక చారిత్రిక స్థంభం.ఇది రాజగిరి కొండ మీద ఎత్తైన ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో దివ్యమైన అందంతో అలరారుతోంది. ఈ స్తూపాన్ని ప్రపంచశాంతిని ప్రతిబింబించే తెల్లటి పాలరాతితో నిర్మించారు, దీనిలో బుద్ధుడి నాలుగు స్వర్ణ విగ్రహాలు...
బింబిసారుడి జైలు నుంచి గ్రుద్దకూట కొండను, జపనీస్ పగోడాను కూడా చూడవచ్చు. బుద్ధ భగవానుడి శిష్యుడైన బింబిసారుడిని కొడుకు అజాతశత్రు కారాగారంలో వేశాడు. అజాతశత్రు తన తండ్రిని ఎక్కడ ఖైదు అవుతావో కోరుకోమని అడిగాడు. బుద్ధుడు కనపడే ప్రాంతాన్ని బింబిసారుడు ఎంచుకున్నాడు.
ఒక ప్రత్యేకమైన రాతిని రెండు సమాంతర దారులుగా దాదాపు ముప్పై అడుగుల లోతుకు చెక్కిన ప్రాంతానికి పెట్టిన పేరే రథం దారి గుర్తులు. చాలా మంది ఇది శ్రీ కృష్ణుడి రథం గుర్తులని చెప్తారు. ఈ రథం గుర్తుల చుట్టుపక్కల వున్న రాతి మీద వున్న 1 నుంచి 5 వ శతాబ్దానికి చెందినదని...
జరాసంధుడి అఖాడా అనేది ప్రధానంగా ఒక యుద్ధ రంగం. మగధ చక్రవర్తి జరాసంధుడి పేరిట ఇది ఏర్పడింది. భీముడికి, జరాసంధుడికి మధ్య జరిగిన యుద్ధానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.
అజాతశత్రు, బి౦బిసారుడి కాలంలో రాజ వైద్యుడిగా వున్న జీవకుడి గౌరవార్ధం జీవకమేవన్ తోటలు ఏర్పడ్డాయి. బుద్ధుడు కూడా జీవకుడిని సంప్రది౦చేవాడని చెప్తారు.
మౌర్యుల ఘనమైన చరిత్రను, అద్భుతంగా నిర్మించిన కట్టదాను గురించి కరండా చెరువు చెప్తుంది. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం బుద్ధుడు ఇక్కడ బస చేసినప్పుడు ఈ చెరువులోనే స్నానం చేసాడు.
ఎన్నో ఏళ్ళ నుంచి జైన మతావలంబులకు కూడా రాజగిర్ ప్రధాన క్షేత్రం. దీన్నే పంచ పహాడీ అని కూడా అంటారు. ఈ దేవాలయాల నుంచే ఎంతో మంది సాధువులు తపస్సు, ధ్యానం చేసి మోక్షం పొందారు. జైన మత స్థాపకుడు మహావీరుడు కూడా ఇక్కడికి చాలాసార్లు వచ్చాడు. రాజగిర్ కొండ చుట్టు పక్కల వున్న...
వైభవ పర్వతం అడుగున వున్న వేడినీటి బుగ్గలను బ్రహ్మకుండ్ అని పిలుస్తారు. సప్తదార లేక ఏడు కొలనుల నుంచి ఈ నీళ్ళు వస్తాయి. అన్నిటి కన్నా వేడిగా వుండే బుగ్గలో నీటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు వుంటుంది. మగవారికి, ఆడవారికి వేర్వేరు స్నానపు ఘట్టాలు వున్నాయి. ఈ బుగ్గల్లో...
వైభవ కొండల పైన వున్నవి పిప్పల గుహలు. సహజంగా ఏర్పడిన ఈ ప్రత్యేకమైన గుహ నిఘా కోసం ఉపయోగించేవారు. తరువాత దాన్ని బౌద్ధ సన్యాసుల క్షేమం కోసం విడిదిగా వాడారు.