రామలింగ విలాసం పాలస్ సేతుపతి రాజుల వంశానికి చెందినది. దీనిని క్రి. శ. 1674 మరియు 1710 ల మధ్య రామనాథ పురం ను పాలించిన కిజవన్ సేతుపతి నిర్మించాడు. పాలస్ లోపల ఒక పెద్ద దర్బార్ హాలు దానికి ఎదురుగా రాజ కుటుంబ సభ్యుల నివాసాలు చాలా అందంగా నిర్మించారు. పాలస్ గోడలపై రాజ కుటుంబ సభ్యుల కుడ్య చిత్రాలు కలవు. వారు మరాఠా లతో చేసిన యుద్ధం మొదలైనవి వుంటాయి. సేతుపతి రాజ వంశం పాలనతో పాటు కళలను పోషించినది అనేందుకు ఈ కుడ్య చిత్రాలు నిదర్సనంగా కలవు.