విల్లుంది తీర్థం హిందూ మతం మేరకు దర్శించవలసిన 24 తీర్థాలలో ఒకటి. ఈ తీర్థం రాముడు సీత కోరిక మేరకు ఆమె దాహం తీర్చటానికి సముద్రం లోకే బాణం వేసి తాగు నీటిని ఇక్కడ తెప్పించాడు. వెంటనే బావి అక్కడ ఏర్పడి రుచికరమైన నీరు లభించింది.
ప్రతి సంవత్సరం ఈ తీర్థాన్ని వేలాది హిందూ భక్తులు దర్శిస్తారు. స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకుంటారు. ఈ తీర్థం పంబన్ సమీపంలో తన్గాచిమాడం గ్రామం లో కలదు.
మతపర ప్రాధాన్యతే కాక, ఈ నీటి చెలమ స్థానికులకు ఒక ప్రత్యేకమైనది. 1979 సంవత్సరం లో స్థానిక ప్రజల తాగు నీటి కొరకు ఇక్కడ ఒక నిర్మాణం చేసారు. అయితే నీటి లోని ఉప్పు కారణంగా ఈ నిర్మాణం పని చేయటం లేదు. ప్రభుత్వం మరొక నిర్మాణం ఇక్కడ చేపట్టనుంది.