పేరుకు తగ్గట్లుగా, డేరా లేదా కుటీరం, గొప్ప సాధు సన్యాసి బాబా భూమన్ గుర్తుగా నిర్మించారు. ఇది హర్యానా లోని సర్సా జిల్లలో సంగర్ సదన్ లో ఉంది. బాబా భూమన్ కంబోజ్ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, డేరా అనుచరులు కంబోజ్ కమ్యూనిటీ కి చెందినవారు.
బాబా భూమన్ షాహ్, సాధారణంగా ఈయనని కేవలం బాబా భువన అని పిలుస్తారు, ఈయన భారతదేశ ప్రసిద్దిచెందిన ఉడసి సాధువులలో ఒకరు. ఈయన ప్రస్తుతం పాకిస్తాన్ లోని ఒకారా జిల్లాలోని బెహోల్పూర్ గ్రామంలో 1687 ఏప్రిల్ 14 న జన్మించాడు. అతని పేరు భిమియా. ఈయన తల్లిదండ్రులు ఎక్కువగా గురు నానక్ అలాగే ఉడసి సంప్రదాయం, తెగకు చెందిన బాబా శ్రీ చ౦ద్ భక్తులు. పుట్టుకతోటే ధార్మిక బుద్ది ఉండడంవల్ల, బాబా తన 14 వ ఏట పాక్పత్తాన్ లోని బాబా ప్రియం దాస్ చే ఉడసి సంప్రదాయాన్ని అభ్యశించాడు, ఆయన ఈనకి బాబా భూమన్ దాస్ అనే పేరు పెట్టాడు.
ఈయన శాంతంతో, సహోదరభావంతో మతసంబంధ ఉపన్యాసాలు చేయడం, దగ్గరయిన వారికి కీర్తనలను, ఎక్కువ సేపు భోజనం లేకుండా ఉండడం గురించి చెప్పడం ప్రారంభించాడు. పదవ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ నీ పాకశాల ఎటువంటి లోటూ లేకుండా అక్షయంగా కొనసాగుతుందని చెప్పి దీవించాడని నమ్మకం. బాబా 1762 లో మరణించాడు, కానీ అతని వారసత్వం మహంతలు లేదా మతపరమైన నాయకులద్వారా జరుపబడింది.
దేశ విభజనకు ముందు, బాబా భూమన్ అనుచరులు వారి గురువుగారి అడుగుజాడలలో నడవడానికి సిర్సా లో డేరా ను ఏర్పాటుచేసుకున్నారు.



Click it and Unblock the Notifications