మజతాల్ అభయారణ్యం సోలన్ జిల్లా నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధ వన్యప్రాణుల కేంద్రం. సుమారు 55,670 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ వన్యప్రాణుల కేంద్రం, మొదటగా 1962 లో అభయారణ్యంగా ప్రకటించబడింది. ఇది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చే 1974 లో అభయారణ్యంగా పునః ప్రకటించబడింది. ఈ అభయారణ్యం వివిధ జాతుల వృక్షజాలం మరియు జంతుజాలానికి నెలవు. ముఖ్యంగా, దాని గోరల్స్ మరియు చీర్ నెమళ్ళ కోసం చాలా ప్రసిద్ధి చెందింది. గోరల్, మేక మాదిరి స్థూపాకార కొమ్ములు కలిగిన చిన్న జంతువు. చీర్ నెమలి, పొడవైన తోక గల పక్షి. ఇక్కడ కనిపించే ఇతర జంతువులలో, చిరుత, హిమాలయ నల్ల ఎలుగుబంటి, మొరిగే జింక, హిమాలయ తాటి పునుగు పిల్లి, అడవి పిల్లి, పసుపు కంఠం మార్టెన్, భారతీయ అడవి ఎలుగుబంటి మరియు లంగూర్ (ఒక జాతి కోతి) ఉంటాయి.నల్ల ఫ్రాంకోలిన్ మరియు తూర్పు తెల్ల వెన్ను రాబందు వంటి అరుదైన పక్షులు కూడా అభయారణ్యం లో కనుగొనవచ్చు.
యాత్రికులు సిమ్లా-బిలాస్ పూర్ రహదారి ద్వారా ఈ అభయారణ్యం చేరుకోవచ్చు. ఈ అభయారణ్యానికి నేరుగా రవాణా సౌకర్యం లేనందువలన, పర్యాటకులు సిమ్లా-బిలాస్ పూర్ రహదారి మీద ఉన్న కాష్లోగ్, వద్ద ఆగి, అభయారణ్యం వరకు నడవాలి. శీతాకాలం, ఈ అభయారణ్యం సందర్శించడానికి అనువైన సమయంగా భావించబడుతుంది. ఇక్కడ వసతి , అడవి ఇళ్ళ రూపంలో అందుబాటులో ఉంటుంది.