అసర్ మహల్ అప్పటి రాజుల కాలంలో న్యాయస్థానంగా వాడారు. 1646 లో మొహమ్మద్ ఆదిల్ షా నేతృత్వంలో దీనిని నిర్మించారు.ఈ నిర్మాణం సుమరు మూడున్నర శతాబ్దాల కిందటిది.న్యాయస్థానంగా నే గాక ప్రవక్త గడ్డపు వెంట్రుకలు సంరక్షించే ప్రముఖ ప్రదేశంగా అసర్ మహల్ పేరు పొందింది.
ఈ మొత్తం కట్టడంలో ప్రతి చిన్న వివరణను ఎంతో అద్భుతంగా ప్రత్యేకమైన శ్రద్ధతో మలచారు. ఈ నిర్మాణంలోని పై అంతస్తులో అద్భుతమైన కుడ్యచిత్రాల చిత్రలేఖనంతో అలంకరించారు. ఈ ప్రదేశంలో ప్రతి సంవత్సరం ఉరుసు పండుగ జరుగుతుంది.ఈ ప్రదేశంలో ప్రదాన వాకిలి వద్ద రాజవంశ స్త్రీల ప్రవేశం నిషిద్ధమైన ఒక చతురస్రాకారపు తటాకము ఉంది. ఇక్కడ గల మూడు పెద్ద తటాకములలో ఒక తటాకము 15 అడుగుల లోతులో ఉంది. దీంతో పోలిస్తే మిగిలిన రెండు తటాకాలు వ్యాసంలోను లోతులోను చిన్నవి.చారిత్రక అసర్ మహల్ కట్టడం వెనుక కోట ప్రహరి గోడ పైన ఒక చిన్న మసీదుకు చెందిన శిధిలాలు చూడవచ్చు. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ మసీదు అద్భుతమైన ప్రధానద్వారాన్ని కల్గి ఈ ప్రాంతమంతా శాసనాలు చెక్కి ఉంటాయి. ఇది ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.అసర్ మహల్ ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది